ఓదెల, జూన్ 13 : ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు రూ.2 వేల నగదును బహుమానంగా అందజేయనున్నట్టు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్పంచ్ జీల రాజుయాదవ్ ప్రకటించారు.
శనివారం బడిబాటలో ఉపాధ్యాయులతో కలిసి ఈజీఎస్ ప నులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడిలో చేరిన విద్యార్థి తల్లిదండ్రులకు 2 వేలు అందించనున్నట్టు తెలిపారు.