హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఏపీ శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు సుధీర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ రాజ్పథ్లో ప్రదర్శనకు ఎంపికచేసిన ప్రతిష్ఠాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కూడా ఉన్నది. సహజ రంగులు వాడి చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్పై చేతితో పెయింటింగ్ వేసే పురాతనశైలి ఇది. కలంకారీ అనేది పర్షియన్ పదం. ఇక్కడ ‘కలం’ అంటే కలం ‘కరి’ అంటే కళాత్మకత. ఇందులో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్బింగ్, క్లీనింగ్ ఇలా మొత్తం 23 దశలు ఉంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్లు పువ్వులు, నెమలి, పైస్లీల మొదలు మహాభారతం, రామాయణం వరకు విస్తరించి ఉంటాయి. ఈ కళను చీరల తయారీలో ఉపయోగిస్తున్నారు. సుధీర్ అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్న కలంకారీ కళాకారుడు. హంపిలోని కన్నడ వర్సిటీ నుంచి పెయింటింగ్లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్(బీవీఏ) పూర్తిచేశారు.