హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశమైన ‘గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెలోషిప్’కు హైదరాబాద్కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్రెడ్డి ఎంపికయ్యారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎస్కేయూపీ నార్వేజియన్ ఫౌండేషన్ ఆయనకు ఫెలోషిప్ అందజేస్తున్నది. పరిశోధనాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించేందుకు ఎస్కేయూపీ పనిచేస్తున్నది. స్వీడన్లోని గోథెన్బర్గ్లో సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగనున్నది. సమాజంలోఅవినీతి, అక్రమాలను అరికట్టేలా ప్రజలను చైైతన్యపరిచేందుకు అవసరమైన సరికొత్త పద్ధతులపై 150 సెషన్స్ సమావేశాల్లో నిర్వహించనున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాన్ఫరెన్స్లో టెక్నిక్లు, అత్యాధునిక వర్షాప్లు, విస్తృతమైన నెట్వరింగ్, టూల్స్ వంటి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ సదస్సుకు 100కుపైగా దేశాల నుంచి 2000 మంది హాజరుకానున్నారు.