Air India | న్యూఢిల్లీ, మే 12: ‘విమానంలో పైలట్ గర్ల్ఫ్రెండ్’ ఉదంతంలో ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా పడింది. ప్రయాణ సమయంలో అపరిచితులను కాక్పిట్లోకి తెచ్చి పైలట్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని, దీనిపై స్పం దించి చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైందని, అందుకే రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ ఉదంతానికి బాధ్యుడైన పైలట్ లైసెన్స్ను మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీ నుంచి దుబాయి వెళ్తున్న ఏఐ-915 ఎయిర్ ఇండియా విమానంలో పైలట్ స్నేహితురాలొకరు విమానం కాక్పిట్లోకి ప్రవేశించింది.