Heart Stroke | యాదాద్రి భువనగిరి : మోత్కూర్ పరిధిలోని రాజన్నగూడెంలో విషాదం నెలకొంది. తాటి చెట్టుపైనే గుండెపోటుతో గీత కార్మికుడు మృతి చెందాడు. గీత కార్మికుడి డెడ్బాడీని తాటి చెట్టుపై నుంచి కిందకు దించారు పోలీసులు.
లక్ష్మయ్య(68) అనే గీత కార్మికుడు కల్లు గీసేందుకు బుధవారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో చెట్టుపైనే లక్ష్మయ్య ప్రాణాలొదిలాడు. స్థానిక రైతులు లక్ష్మయ్యను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని కిందకు దించారు. లక్ష్మయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.