హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): మధుమేహ వ్యాధి (డయాబెటిస్)కి సరికొత్త చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్)లో ఓ స్టార్టప్ ప్రారంభమైంది. యూవోహెచ్తోపాటు రీజీన్ ఇన్నోవేషన్ ప్రైవేటు లిమిటెడ్, ఎస్పైర్-బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయక్తంగా ఈ స్టార్టప్ను ప్రారంభించాయి. టైప్-1, టైప్-2 డయాబెటిస్ను నిరోధించేందుకు కొత్త రకమైన చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నట్టు రీజీన్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు డాక్ట ర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.