హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖను రీ ఆర్గనైజ్ చేసి, కొత్త క్యాడర్, కొత్త పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ నేతలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు 9 పేజీలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది.
ఇటీవలే క్యాబినెట్లో డీఎంహెచ్వో పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకొన్న విషయం విదితమే. ఈ తరహాలో విద్యాశాఖలో కూడా కొత్తగా ఆర్జేడీ, డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి రాజగంగారెడ్డి, కోశాధికారి తుకారం విజ్ఞప్తిచేశారు.