కట్టంగూర్(నకిరేకల్), 18 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఆదివారం ముగిసింది. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఆయా పార్టీల నుంచి 195 మంది 305 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి 81, బీజేపీ నుంచి 36, కాంగ్రెస్ నుంచి 44, సీపీఎం నుంచి 13, టీడీపీ నుంచి 3, ఫార్వర్డ్ బ్లాక్ 33, స్వతంత్రుల నుంచి 95 దాఖలయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 మంది రిటర్నింగ్ అధికారులు ఒక్కొక్కరు రెండు వార్డుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరిరోజు నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ పరిశీలించారు.
నల్లగొండలో10నామినేషన్లు..
నల్లగొండ మున్సిపాలిటీలోని 26వ వార్డుకు చివరి రోజు 8నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి అస్మాసుల్తానా, కాంగ్రెస్ నుంచి దుబ్బ రవళిక, బీజేపీ నుంచి దాసరి మహేశ్వరి, ఎంఐఎం నుంచి గౌసీయాబేగం, ఇండిపెండెంట్గా ఫరీదాబేగం నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి ఒక సెట్, బీజేపీ నుంచి రెండు సెట్లు, టీఆర్ఎస్ రెండు సెట్లు, ఎంఐఎం రెండు సెట్లు సమర్పించారు. ఈనెల 17న వేసిన రెండు నామినేషన్లతో కలిపి మొత్తం 10 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేసిన సమయంలో వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, బషీర్ తదితరులు ఉన్నారు.