సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన కల్హేర్ (మం) మహదేవ్ పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటి అవసరాల కోసం నిర్మించుకున్న నీటి సంపులో పడి గ్రామానికి చెందిన గంగమణి అతడి కుమారుడు సంగమేశ్వర్ మృతి చెందారు. గంగమణి అంధురాలు కాగా..ఆమె కొడుకు సంగమేశ్వర్ అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. తల్లీ కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.