హైదరాబాద్, జనవరి28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.2లక్షల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, ఆర్థిక, సామాజిక న్యాయశాఖల మంత్రులకు శనివారం ఆయన లేఖ రాశారు. దేశంలో 52శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు 2021-22 సంవత్సర బడ్జెట్లో కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, అందులో రూ.80 కోట్లను కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రథమ స్థానంలో ఉన్నదని కొనియాడారు.