Hanamkonda | సుబేదారి, డిసెంబర్ 14: ‘నీతో’ యాప్లో పరిచయమైన యువతిని ఓ వ్యక్తి మోసం చేశాడు. తాను అనాథనని నమ్మించి రూ.7.55 లక్షలు తీసుకొని మోసం చేశాడు. హనుమకొండ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కథనం ప్రకా రం.. హనుమకొండకు చెందిన యువతికి ‘నీతో’ యాప్ ద్వారా బంజారాహిల్స్కు చెందిన యువకుడు వెంపటి వసంత్ పరిచయమయ్యాడు. తనకు ఎవరూ లేరని, అనాథనని డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పడంతో ఆమె నమ్మి, తన బ్యాంకు ఖాతా ద్వారా ఈ జూన్ నుంచి నవంబర్ 10 వరకు పలు దఫాలుగా రూ.7.55 లక్షలు వసంత్ ఖాతాకు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.