కరీంనగర్ విద్యానగర్/రామవరం/గజ్వేల్ : సాధారణ సంవత్సరాల కంటే.. నాలుగేండ్లకోసారి వచ్చే లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండటం విశేషం. ఈ విశేషమైన రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు జన్మించారు.
కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పది మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో 9 మంది, సిద్దిపేట జిల్లా గజ్వేల్ దవాఖానలో ఏడుగురు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో ఒకరు జన్మించారు. సాధారణంగా జన్మించిన అందరూ ఏటా జన్మదిన వేడుకలు చేసుకుంటే.. లీప్ ఇయర్లో పుట్టిన వారు మాత్రం నాలుగేండ్లకోసారి ఫిబ్రవరి 29న బర్త్డే జరుపుకోవడం నిజంగా వారికోపండుగే.