వరంగల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ మహానగర పరిధిలోని మడికొండ ఐటీ పారులో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జాబ్మేళా ఏర్పాటుచేశారు. ఉద్యోగార్థులు భారీగా తరలివచ్చారు. 36 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఒకో కంపెనీలో 50 చొప్పున ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను చేపట్టారు.
తెలంగాణతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన 15,895 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగా.. 6,800 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. వీరే కాకుండా మరికొందరు నేరుగా హాజరు కావడంతో 10 వేల వరకు అభ్యర్థులు హాజరయ్యారని మేళా ప్రతినిధి, సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి తెలిపారు. అన్ని కంపెనీల్లో కలిపి 1,600 వరకు ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. ఒక్క టెక్ మహీంద్రానే 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మడికొండ ఐటీ పార్కులో మరిన్ని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ స్థలం కేటాయించనున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, క్వాడ్రంట్ సంస్థ ఎండీ కంచరకుంట్ల మురళీధర్రెడ్డి, వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు.