కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్లోని రైల్వే గూడ్స్ యార్డులో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్కు అతి సమీపంలో గూడ్స్ యార్డులోని పట్టాలపై నిలిచి ఉన్న పాత రైలు బోగీలకు మంటలు అంటుకున్నాయి.
రైల్వే అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.50 లక్షల వరకు రైల్వేకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు.