భూమి ఉండి పట్టాలు లేని రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని రైతు సంఘం నాయకుడు గుండెబోయిన రవిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ములుగు సమీపంలోని సర్వాపురం-అంకన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న బొగ్గులవాగులో రైతు నాయకులతో కలిసి జలదీక్ష చేపట్టారు.
జలదీక్షలో నాయకులు బిక్కినేని కొండల్రావు, తిరుపతి, శ్రీనివాస్, గుండెమీది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.