రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పాలనలో నేతన్నలు చావులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు(Handloom worker) ఉరివేసుకొని ఆత్మహత్య (Committed suicid) చేసుకున్న సంఘటన సిరిసిల్ల(Siricilla) పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని బీవై నగర్కు చెందిన తడక శ్రీనివాస్ అనే వ్యక్తి చేనేత పరిశ్రమలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కాగా, గత మూడు నెలలుగా సిరిసిల్ల పట్టణంలో చేనేత పరిశ్రమలో పనులు లేక ఇబ్బందులకు గురయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడు కనీసం మందులు కూడా కొనలేని స్థితిలో మనస్థాపానికి గురైన శ్రీని వాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్కు ఇద్దరు కూతుళ్లు అనూష, అక్షయ ఉన్నారు. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.