Gadwal | గద్వాల, మార్చి 30: ‘అందరికీ మాట్లాడటానికి మైక్ ఇస్తున్నారు.. నాకు ఎందుకు ఇవ్వ డం లేదు’ అని ప్రశ్నించిన దళితుడైన ఉమ్మడి మహబూబ్నగర్ జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్కు చుక్కెదురైంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అనుచరులు అతడిని వేదిక పైనుంచి తోసేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్హాల్లో శనివారం గద్వాల, అలంపూర్ నియోజకవర్గ కాం గ్రెస్ బూత్ లెవల్ స్థాయి కన్వీనర్ల సమావేశాన్ని గద్వాల, అలంపూర్ ఇన్చార్జీలు సరిత, సంపత్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మ ల్లు రవి, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, ఏఐసీసీ నేత రోహిత్ చౌదరి, జడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలపై బూత్లెవల్ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. సమావేశం చివరికి వచ్చినా తనకు మాట్లాడటానికి మైక్ ఇవ్వడం లేదని మాజీ జడ్పీచైర్మన్ బండారి భాస్కర్ నిలదీశా రు. ఆగ్రహంతో దురుసుగా మాట్లాడటంతో అక్కడే ఉన్న సంపత్ అనుచరులు అతడిపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. స్టేజీపై నుంచి తోసుకుం టూ వెళ్లారు. ఒక దశలో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్పరిణామాన్ని అందరూ చూ స్తూ ఉండిపోయారే తప్పా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. కార్యకర్తలు సమన్వయం పా టించాలని మంత్రి జూపల్లి మైక్లో చెప్పినా వినిపించుకోలేదు. అక్కడున్న ప్రజాప్రతినిధులు కార్యకర్తలను శాంతింపజేశారు.