నాగర్కర్నూల్ : ఒకే ఈతలో ఒకట్నుంచి రెండు మేక పిల్లలు జన్మించడం చూశాం.. మూడు ఆపై జన్మించడం చాలా అరుదు. కానీ కొన్ని సందర్భాల్లోనే ఇలాంటి ఘటనలను చూస్తుంటాం. ఓ మేక ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ మేక.. ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఐదు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు యజమాని మంతయ్య తెలిపాడు. మేక పిల్లలను చూసేందుకు గ్రామస్తులు మంతయ్య ఇంటికి చేరుకుంటున్నారు.