ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీరు లేకుండా ఎండిపోయిన చెరువులు, కుంటలు.. ఇప్పుడు నిండానీరు, మత్స్యసంపదతో కళకళలాడుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంటల్లో పూడిక తీయించి మరమ్మతులు చేయడంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో మండువేసవిలోనూ మత్తళ్లు పోస్తున్నాయి. ఫలితంగా సాగునీరు పుష్కలంగా అందడమేగాక ముదిరాజ్లకు చేతినిండా జాలరిపని దొరుకుతున్నది. ఆదివారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ముత్యాలమ్మ చెరువులో మత్స్యకారులు చేపలు పట్టి గట్టు పక్కన వరుసగా ఆరబోసిన దృశ్యమే అందుకు నిదర్శనం.
-చిన్నగూడూరు