జ్యోతినగర్(రామగుండం), అక్టోబర్ 24: పెద్దపల్లి జిల్లాలోని 62.5 మెగావాట్ల రామగుండం బీ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాయిలర్లో బొగ్గు ను మండిస్తుండగా కోల్ఫైర్ బయటకు రావడంతో పవర్కేబుల్ అంటుకొని మంట లు చెలరేగాయి.
ఫైర్ సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టా రు. కొంతమేరకు ఆస్తి నష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్లాంటులో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.