రాంనగర్, మార్చి 31: స్కూల్కు వెళ్తున్న మహిళా టీచర్ రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. నగరంలోని అలాపూర్ కాలనీకి చెందిన బైరెడ్డి రజిత రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ సూల్లో గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఒంటిపూట బడులు కావడంతో ఉదయం ఆరున్నర గంటలకు ఇంటి నుంచి స్కూటీపై స్కూల్కు బయల్దేరారు.
కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రహదారి గుండా వస్తుండగా పద్మానగర్ వద్ద ఎదురుగా వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ కింద పడిపోయి అకడికకడే మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కాంక్రీట్ మిక్చర్ లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌ న్ సీఐ లక్ష్మీ బాబు తెలిపారు. కాగా, తొమ్మిదేండ్ల క్రితం ఆమె భర్త బైరెడ్డి తిరుపతిరెడ్డి గుండెపోటుతో మరణించారు. గతంలో తండ్రి, ఇప్పుడు తల్లిని కోల్పోయిన ఇద్దరు కొడుకులు ప్రజ్ఞాన్రెడ్డి(15), రిషిక్ (11) అనాథలయ్యారు.