Dalit Bandhu | ములుగు : దళితబంధును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. దళితబంధు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా లక్షల రూపాయాలు వసూళ్లు చేసి, పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీతక్క కొడుకు.. దళితబంధు ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ. 3 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. దళితబంధు ఇప్పించకపోవడంతో బాధితుడు ములుగు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగి, తన నిరసన వ్యక్తం చేశాడు.
బాధితుడు మాటల్లోనే.. నా పేరు దయాకర్, ములుగు మండలం. దళితబంధులో నాకు అన్యాయం జరిగింది. దళితబంధు ఇప్పిస్తానంటే ఎమ్మెల్యే సీతక్క కుమారుడికి మధ్యవర్తి ద్వారా రూ. 3 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి దళితబంధు ఇవ్వలేదు. ఇవాళ రేపు అంటూ ఎనిమిది నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకు అమౌంట్ కూడా తిరిగి ఇవ్వలేదు. మధ్యవర్తి ద్వారా అప్పుడు, ఇప్పుడు అని చెప్పిస్తున్నారు. ఈ అమౌంట్ వారికి ఇవ్వడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు, మా భార్యతో గొడవలు. 3 లక్షల రూపాయాలు ఉట్టిగ ఇస్తే ఎట్ల ఉంటది చెప్పండి. సీతక్క కుమారుడికి మధ్యవర్తి ద్వారా నగదు పంపించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. నాతో ఫోన్ మాట్లాడిన రికార్డు కూడా ఉంది అని దయాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.