నంగునూరు, ఆగస్టు 6 : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకపోతే బీజేపీ సర్కారుకు గుణపాఠం తప్పదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరులో నిర్వహించిన టీఎమ్మార్పీఎస్ మండల సమావేశంలో వంగపల్లి మా ట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు కాసేపాక రాజేందర్, లక్ష్మాపురం కనకయ్య, జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.