హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )ను చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్ ఎర్రవెల్లి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జుబేర్ మహమ్మద్, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ వారికి రంజాన్ ( Ramadan ) శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా పలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.