మల్యాల, ఏప్రిల్ 16 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల గ్రామానికి చెందిన ఏడాదిన్నర చిన్నారి మంగళవారం ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మద్దుట్లకు చెందిన రజాక్-హసీనా దంపతులకు ఐదేండ్ల కొడుకు సాజిత్, ఏడాదిన్నర అరీబా ఉన్నారు.
సాజిత్ రామన్నపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుచున్నాడు. హసీనా కొ డుకును బడికి పంపేందుకు స్కూల్ బస్సు వద్దకు కూతురు అరీబాతో కలిసి వచ్చింది. బస్సు ముందుకు కదలడంతో పక్కనే ఉన్న అరీబా పైకి బస్సు టైర్ ఎక్కింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.