మెదక్ జిల్లా రామాయంపేట శివారులో శనివారం వేకువజామున ఓ కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దాదాపు సగం వరకు కోళ్లు చనిపోయాయి. అటుగా వెళ్లేవారు ప్రాణంతో ఉన్న కోళ్లను అందినకాడికి ఎత్తుకుపోయారు. ఈ ప్రమాదంతో వ్యాపారికి రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది.
– రామాయంపేట