ములుగు : భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్(Bairi Naresh) కారు డ్రైవర్ రాము(Car driver Ramu)పై ఏటూరు నాగారం పోలీసులు కేసు నమోదు(Case registered) చేశారు. సోమవారం బైరి నరేష్, అయ్యప్ప మాలదారుల మధ్య వాగ్వాధం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కారు డ్రైవర్ రాము బైరి నరేష్ వెళ్లే క్రమంలో ఆజాగ్రత్తగా కారు నడపడంతో అయ్యప్ప మాలదారుడు పోగు నరసింహారావు అనే వ్యక్తి గాయపడ్డాడు. నర్సింగరావు బంధువులు నూతి కృష్ణ ఫిర్యాదు మేరకు బైరి నరేష్ కార్ డ్రైవర్ రాములు పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ ప్రసాద్ తెలిపారు.