ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురైన ఓ మహిళ తాను మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణం పోసింది. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన గోరంకల ప్రమీల(44) తన భర్తతో కలిసి ఈ నెల 16వ తేదీన ముదిగొండ మండలంలోని ఓ శుభకార్యానికి హాజరైంది. ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత ప్రమీల, ఆమె భర్త కలిసి బైక్పై స్వగ్రామానికి బయల్దేరారు.
అయితే ఖమ్మం నగర పరిధిలోని మమత రోడ్డులో వారి బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో ప్రమీల తలకు బలమైన గాయాలు కావడంతో, ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ప్రమీలను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు భర్త ముందుకు వచ్చాడు. ప్రమీల అవయవాలను దానం చేసి ముగ్గురికి ప్రాణం పోశారు. భర్త నిర్ణయాన్ని వైద్యులు ప్రశంసించారు.