Nizamabad | నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 31: ఓ భవనంపై పతంగి ఎగురవేస్తున్న బాలుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. నగరంలోని ఆర్యనగర్-సంజీవ్రెడ్డి కాలనీకి చెందిన శివలీల-మల్లికార్జున్ దంపతులు. వీరి కొడుకు వెంకటి శ్రీరాం(9) ఆదివారం సాయంత్రం భవనంపై పతంగి ఎగరవేస్తుండగా విద్యుత్తు తీగలకు తట్టుకున్నది.
గాలిపటాన్ని తీసేందుకు ఇనుప సలాకతో ప్రయత్నిసుండగా.. విద్యుత్తు షాక్ తగలడంతో బాలుడి శరీరం మొత్తం కాలి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబీకులు బాలుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 60 శాతం కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.