Nizamabad | నిజామాబాద్ : చదవాలన్న తపన ఉన్నా చిన్నప్పుడు పరిస్థితులు కలిసిరాలేదు. 60 ఏండ్ల వయస్సులో అవకాశం రావడంతో పట్టుబట్టి చదివి పదోతరగతి పాసయ్యాడో వృద్ధుడు. యుక్త వయస్సు దాటిందంటే చదువుపై ఆసక్తి లేని ఈ రోజుల్లో ఆయన ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం గ్రామ సర్పంచ్ కెతావత్ కన్నిరాం చిన్నప్పుడు చదువుకోవాలని ఆశ ఉండేది. కానీ కుదరలేదు. అయితే చదువుపై ఆసక్తితో రుద్రూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఓపెన్ టెన్త్ చదివి ఉత్తీర్ణత సాధించాడు. 60వ వడిలో 10వ తరగతి పాసైన కన్నిరాం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.