హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 74 ఆధారంగా పారా క్రీడాకారులకు 2 శాతం ఉద్యోగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని జాతీయ పారా క్రీడాకారుడు, వికలాంగుల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధీరావత్ మహేశ్నాయక్ డిమాండ్ చేశారు. వికలాంగుల క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీ దివ్యాంగ క్రీడాకారుల గుర్తింపు కోసం దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్టు గుర్తుచేశారు.