హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పదోతరగతి థర్డ్ లాంగ్వేజీ పరీక్షకు 99.71 శాతం హాజరు నమోదైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. గురువారం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,94,706 మంది విద్యార్థులకు 4,93,273 మంది విద్యార్థులు హాజరైనట్టు వెల్లడించారు. ఒక మాల్ప్రాక్టీస్ కేసు నమోదుతో వికారాబాద్ జిల్లా నుంచి ఒక ఇన్విజిలేటర్ను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు.