హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తె లంగాణ): లాసెట్, పీజీలాసెట్ తుది విడత కౌన్సెలింగ్లో మంగళవారం 96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 3,447 సీట్లకు 10,375 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 3,331 మందికి సీ ట్లు కేటాయించారు.
ఇంకా 116 సీట్లు మిగిలాయి. తొలి విడత కౌన్సెలింగ్లో 6,894 సీట్లుండగా 5,912 మంది సీట్లు పొందా రు. వీరిలో 3,729 మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు. సీట్లు పొందిన వారు 23లోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేశ్బాబు సూచించారు.