హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు టారిఫ్ సబ్సిడీతోపాటు ఇతర సబ్సిడీల కింద రూ.958.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. డిసెంబరు నెల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సబ్సిడీ, నీటిపారుదల శాఖ పరిధిలోని హెచ్టీసీసీ చార్జీలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసెస్-సీవరేజ్ బోర్డు, మిషన్ భగీరథ బిల్లులు, సబ్సిడీల మొత్తానికి ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీల కోసం మంజూరు అనుమతినిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.