హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్టు ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్, కో కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు.
ఈ ఏడాది ఫార్మసీతో పాటు బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ బైపీసీ ర్యాంకును ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఎంసెట్ పరీక్షల ప్రారంభం సందర్భంగా ఇనిషియల్ కాన్ఫిగరేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, కో ఆర్డినేటర్లు కే భాస్కర్, టీ మాధవికుమారి పాల్గొన్నారు. అక్కడక్కడ పలువురు విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షలకు అనుమతించలేదు.