హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్లో 92.55శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మంగవారం తుది విడత సీట్లు కేటాయించారు. మొత్తం 27,803 సీట్లకు 25,733 సీట్లు నిండాయి. కోర్సుల వారీగా తీసుకొంటే ఎంబీఏలో 91. 57శాతం, ఎంసీఏలో 99.85శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఎంసీఏలో కేవలం 5 సీట్లు మాత్రమే మిగిలాయి. 96 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండినట్టు అధికారులు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు 30లోపు ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని సూచించారు.