కరీంనగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో 7,800 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామ ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 90 నియోజకవర్గాల్లో ఇం డోర్ స్టేడియాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 45 పూర్తయినట్టు చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం కరీంనగర్లోని క్రీడాపాఠశాలలో సింథటిక్ ట్రాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పాలసీతో కామన్వెల్త్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో విద్యా వైద్యంతోపాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు నిధులు సమకూర్చుతారని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.