BJP | ‘పైన పటారం.. లోన లొటారం’ అన్నట్టు బీజేపీ ప్రభుత్వ పాలనంతా డంబాచారంగానే నడుస్తున్నది. దేశప్రగతికి కీలకమైన ప్రధాన సూచీల్లో భారతావని దిగజారిపోయింది. ఒకటా.. రెండా.. ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ వంటి 50కి పైగా సూచీల్లో ఇండియా అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇదీ తొమ్మిదేండ్లలో బీజేపీ ప్రభుత్వ పాలనకు నిలువుటద్దం.
దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుదుత్పత్తి, దిగుమతుల సూచీ, జీడీపీ వృద్ధిరేటు, జీడీపీ మొత్తం విలువ, క్రెడిట్ రేటింగ్, గోల్డ్ రిజర్వ్స్, కరెంట్ అకౌంట్, వడ్డీరేట్లు, జనాభా-బడ్జెట్ వ్యాల్యూ, రాబడి-వ్యయం, జీడీపీలో పారిశ్రామికరంగం, జీడీపీలో తయారీరంగం, జీడీపీలో నిర్మాణరంగం వాటా, జీడీపీలో మైనింగ్ వాటా, జీడీపీలో సేవలు, జీడీపీలో అడ్మిన్ సర్వీసెస్,హోమ్ ఓనర్షిప్ రేట్, బ్యాంకుల్లో క్యాష్ రిజర్వ్లు, బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ, సమ్మిళిత వృద్ధి తదితర కీలకాంశాల్లో భారత్ అట్టడుగు స్థానాల్లో (60 నుంచి 100 ర్యాంకుల మధ్య) ఉన్నది. ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్ ర్యాంకింగ్స్లో 43వ ర్యాంకు, జీవన ప్రమాణాల సూచీలో 65వ ర్యాంకు, పారదర్శక పాలనలో 101వ ర్యాంకు, చట్టబద్ధ పాలనలో 69వ ర్యాంకు, పరివర్తన సూచీలో 34వ ర్యాంకుతో భారత్ మిగతా దేశాలతో పోలిస్తే ఎంతో వెనుకంజలో ఉన్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సంస్థలు సమర్పించిన అభివృద్ధి, ప్రగతి నివేదికలలో తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వం ఓ వైఫల్యాల పుట్ట అని రూడీ అయ్యింది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే 50కి పైగా ప్రధాన సూచీలు, అంశాల్లో భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే, అసలు వాస్తవాలను కప్పిపుచ్చి.. తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు కమలనాథులు తప్పుడు ప్రచారానికి తెరతీస్తుండటం విమర్శలకు దారితీస్తున్నది.
2014లో ర్యాంకు: 114
ప్రస్తుత ర్యాంకు: 135
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: సమ్మిళిత అభివృద్ధికి దిక్సూచీగా పిలిచే లింగసమానత్వ సూచీలోనూ భారత్ అంతకంతకూ దిగజారుతున్నది. 2014లో 114వ ర్యాంకు నమోదు చేసిన దేశం.. ప్రస్తుతం 135వ స్థానానికి పరిమితమైంది.
2014లో ర్యాంకు: 140
ప్రస్తుత ర్యాంకు: 161
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: దేశంలోని మీడియా సంస్థలపై బీజేపీ సర్కారు నియంత్రణ ఎక్కువైందన్న వాదనలు ఉన్నాయి. దీన్ని నిరూపిస్తూ.. 2014లో పత్రికా స్వేచ్ఛ సూచీలో 140వ స్థానంలో ఉన్న భారత్.. 161కు దిగజారింది.
2014లో ర్యాంకు: 3
ప్రస్తుత ర్యాంకు: 1
(తక్కువ ర్యాంకుప్రతికూలతకు సంకేతం)
ప్రపంచవ్యాప్తంగా బానిస త్వంలో మగ్గిపోతున్న మొత్తం 5 కోట్ల మందిలో అత్యధికంగా 1.1 కోట్ల మంది భారత్లోనే ఉన్నట్టు ‘వాక్ ఫ్రీ’ ఆర్గనైజేషన్ నివేదిక వెల్లడించింది. పెరిగిన ధరలు, అప్పులను భరించలేక.. స్థిరమైన ఉపాధికోసం భారత్లో నిరుపేదలు వలస వెళ్తున్నారని అభిప్రాయపడింది.
55-2014
2023-107
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: సూడాన్, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాలకంటే ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది. 9 ఏండ్ల బీజేపీపాలనలో ఆకలిసూచీలో భారత్ ర్యాంక్ 52 స్థానాలు పతనమయ్యాయి.
ర్యాంకు
2014 -106
2023-150
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: బీజేపీప్రభుత్వ హయాంలో పౌర హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ఆమ్నెస్టీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశా యి. దీన్ని ధ్రువపరుస్తూ 2014లో పౌర స్వేచ్ఛ సూచీలో 106వ ర్యాంకు సాధించిన భారత్.. ప్రస్తుతం 150కి పడిపోయింది.
ర్యాంకు
2014-111
2023-126
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: సామాజిక భద్రత, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, అవినీతి వంటి సూచీలను ఆధారంగా చేసుకొని వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్ను ఏటా ప్రకటిస్తారు. 2014లో 111వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 126 స్థానానికి పరిమితమైంది.
ర్యాంకు
2014-33
2023- 53
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలిచే భారత్లో.. డెమొక్రసీకి విఘాతం ఏర్పడుతున్నట్టు ఇప్పటికే పలు స్వచ్ఛంద నివేదికలు హెచ్చరించాయి. ఈఏయూ డెమొక్రసీ ఇండెక్స్లో ప్రస్తుతం భారత్ ర్యాంకు 53. తొమ్మిదేండ్ల కిందట ఇది 33గా ఉండేది.
ర్యాంకు
2014-74
2023-85
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: వీసా అవసరం లేకుండా ఏ దేశానికైనా వెళ్లగలిగే అవకాశం కలిగిఉన్న పాస్పోర్ట్ను అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు. అవినీతి, నేరాలు, సంక్షోభాలు తక్కువగా ఉన్న దేశాలు ఈ సూచీలో మెరుగ్గా ఉంటాయి. హెన్లె శక్తిమంతమైన పాస్పోర్ట్ సూచీలో జపాన్, సింగపూర్ టాప్ ప్లేస్లో ఉండగా భారత్ 85వ స్థానంలో ఉన్నది.
ర్యాంకు
2014-155
2023-180
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీసే చర్యలను కట్టడి చేసే దేశాల జాబితాలోనూ భారత్ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ హయాంలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయింది. 9 ఏండ్లలోనే ఈ సూచీలో భారత్ 25 స్థానాలు దిగజారింది. 180వ ర్యాంకుకు పడిపోయింది.
ర్యాంకు
2014-40
2023-41
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: పనిచేసే సామర్థ్యంలేని వయోధికులకు, రిటైరైన ఉద్యోగులకు ఆర్థిక సాయాన్ని అందించే పింఛన్ సూచీలో భారత్ 41వ స్థానంలో నిలిచింది. 44 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 41వ స్థానానికి పరిమితమవ్వడం ఆందోళనకరం.
ర్యాంకు
2014-85
2023-85
వివరణ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఆ దిశగా తీసుకొన్న చర్యలు శూన్యం. ఫలితంగా.. గడిచిన తొమ్మిదేండ్లలో అవినీతి సూచీలో
భారత్ స్థానం ఏమాత్రం మెరుగవ్వలేదు.
2014లో ర్యాంకు: 80
ప్రస్తుత ర్యాంకు: 103
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సహా మొత్తం 54 దేశాలు ఈ సూచీలో భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి.
2014లో ర్యాంకు: 31
ప్రస్తుత ర్యాంకు: 33
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: దేశ జీడీపీ, బడ్జెట్ను బేరీజువేస్తే, రక్షణ రంగానికి భారత్ చేస్తున్న కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్ (29వ ర్యాంకు) మనకంటే మెరుగ్గా ఉన్నది.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ఏదైనా దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉండాలంటే ఎగుమతులు ఎక్కువగా ఉండాలి. చైనా ఒక ఏడాదిలో చేసే ఎగుమతుల విలువ.. మన దేశం పదేండ్ల ఎగుమతులకు సమానం
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, గత ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 16.3% మేర పడిపోయాయి. పదేండ్లలో ఇదే కనిష్ఠం.
2014లో ర్యాంకు: 130
ప్రస్తుత ర్యాంకు: 132
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: మానవ వికాసం,నైపుణ్యాలను పెంపొ ందించే దిశగా ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలను బట్టి ఇచ్చే మానవాభివృద్ధి సూచీలో భారత్ 132వ ర్యాంకుకు పరిమితమైంది. భారత్తో సమానమైన జనాభా ఉన్న చైనా ఈ విషయంలో 79వ స్థానంలో మెరుగ్గా ఉంది.
2014లో ర్యాంకు: 83
ప్రస్తుత ర్యాంకు: 117
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: పనిచేయగల సామర్థ్యం, ఉత్సాహం ఉన్నప్పటికీ, తగినన్ని ఉద్యోగాలు లేకపోవడమే నిరుద్యోగిత. గడిచిన ఏప్రిల్లో దేశంలో నిరుద్యోగిత రేటు 8.11 శాతంగా నమోదైంది. పనిచేయగల సామర్థ్యం ఉన్న దాదాపు 22 కోట్ల మందికి ఇప్పటికీ తగిన ఉద్యోగాలు లభించలేదు.
2014లో ర్యాంకు: 58ప్రస్తుత ర్యాంకు: 79
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: దేశంలోని మొత్తం జనాభాలో 40 కోట్లమందివరకూ పేదరికంలోనే బతుకీడుస్తున్నారు. పేదరికం విషయంలో ఇరాక్, శ్రీలంక వంటి దేశాలు భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి.
2014లో ర్యాంకు: 85
ప్రస్తుత ర్యాంకు: 146
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ఆరోగ్యం, మనుగడకు అవసరమైన సదుపాయాల విషయంలో భారత్ ఎంతో వెనుకబడి ఉన్నది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్లో 2014లో 85వ ర్యాంకులో ఉన్న ఇండియా.. ప్రస్తుతం 61 స్థానాలు తగ్గి 146వ ర్యాంకులో స్థిరపడింది.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: పనికి తగిన వేతనం ఇవ్వడం, నైపుణ్యాన్ని బేరీజువేస్తూ వేతనాలను పెంచడమే వేతనాల్లో వృద్ధిగా పరిగణిస్తారు. అయితే, నిరుద్యోగంలో ముందున్న భారత్.. వేతనాల వృద్ధిరేటులో వెనుకంజ వేస్తున్నది.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: దేశంలో ఎన్నడూ చూడనంతగా ద్రవ్యోల్బణం కట్టలుతెంచుకొంటున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే ఈ సూచీలో భారత్ అట్టడుగున ఉన్నది.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారత్లో.. ఉత్పాదకత రేటు అత్యంత తక్కువగా ఉన్నది. నిరుద్యోగం, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వకపోవడమే దీనికి కారణం.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: అమెరికన్ డాలర్ను అంతర్జాతీయంగా ప్రామాణిక కరెన్సీగా పరిగణిస్తారు. ఒక కువైట్ దినార్కు 3.25 అమెరికన్ డాలర్లు వస్తే, ఒక అమెరికన్ డాలర్ను కొనుగోలు చేయాలంటే, 82 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2014లో ర్యాంకు: 40
ప్రస్తుత ర్యాంకు: 60 (ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: గడిచిన 9 ఏండ్లలో నిత్యావసర వస్తువుల ధరలు దేశంలో దాదాపుగా 300 శాతం వరకు పెరిగాయి.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: రూ. 277 లక్షల కోట్లుగా ఉన్న భారత జీడీపీలో రూ. 160 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో నెత్తిపై 1.2 లక్షల అప్పు ఉన్నట్టు అర్థమవుతున్నది.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత కారణంగా గడిచిన 30 ఏండ్లలో ఎన్నడూచూడని రీతిన పౌరుల పొదుపు ఖాతాలు ఖాళీ అయినట్టు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నివేదికలో ఇటీవలే వెల్లడైంది.
(ఎక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొనే పథకాలు, నిర్ణయాలను బట్టి సామాజిక సంక్షేమం ఆధారపడి ఉంటుంది. భారత్వంటి జనాభా ఎక్కువ గల దేశం.. సామాజిక సంక్షేమ సూచీలో మెరుగ్గాలేకపోవడం అందోళన కలిగిస్తున్నది.
(ఎక్కువ ర్యాంకుప్రతికూలతకు సంకేతం)
వివరణ: దేశ జీడీపీ రూ. 277 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో తలసరి జీడీపీ రూ. 6 లక్షలు దాటట్లేదు.
2014లో ర్యాంకు: 80
ప్రస్తుత ర్యాంకు: 67
(తక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: పాకిస్థాన్లో ప్రతీ వెయ్యిమందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండగా.. భారత్లో ప్రతీ రెండున్నర వేలమందికి కూడా డాక్టర్ అందుబాటులో లేడు.
2014లో ర్యాంకు: 4
ప్రస్తుత ర్యాంకు: 1
(తక్కువ ర్యాంకు ప్రతికూలతకు సంకేతం)
వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో జరిగే మొత్తం ఇంటర్నెట్ షట్డౌన్లలో భారత్ వాటా 56 శాతం.