Hyderabad | హైదరాబాద్ : ఓ ఇద్దరు వ్యక్తులు బ్రెయిన్డెడ్కు గురయ్యారు. వారిద్దరికి చెందిన అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు వారి కుటుంబ సభ్యులు. బ్రెయిన్ డెడ్కు గురైన వారిలో ఒకరు రైతు కాగా, మరొకరు పోలీసు కానిస్టేబుల్.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ గంగాధర అంజయ్య(49) మార్చి 2వ తేదీన బైక్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అంజయ్యను కరీంనగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో నాలుగు రోజులు ఉంచి చికిత్స అందించారు. మార్చి 10వ తేదీన మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అంజయ్య బ్రెయిన్డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.
నల్లగొండ జిల్లాలోని దోనకల్ గ్రామానికి చెందిన 28 ఏండ్ల యాశ చిత్తరంజన్ రెడ్డి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను రైతు కూడా. మార్చి 5వ తేదీన ఆయనకు తీవ్రమైన తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మలక్పేటలోని యశోదకు తరలించారు. నాలుగు రోజుల పాటు ఐసీయూలో ఉంచినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2:05 గంటలకు బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు.
ఇక ఈ ఇద్దరు బ్రెయిన్ డెడ్కు గురి కావడంతో వారి అవయవాలను దానం చేసేందుకు జీవన్ దాన్ సంస్థ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఇద్దరికి సంబంధించిన కిడ్నీలు, కార్నియాతో పాటు లివర్ను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇద్దరి నుంచి 9 అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.