హైదరాబాద్, ఏప్రిల్25 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ చదువుతున్న 89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మైనార్టీ గురుకులాల కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానం తెలిపారు.
ఈ ఏడాది మొత్తం 17,543 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా, 14,352 మంది విద్యార్థులు పాసయ్యారని వెల్లడించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 89శాతం, ఫస్టియర్ విద్యార్థులు 76 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.