హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలల స్థాయి పెంచారు. 86 గురుకులాలకు జూనియర్ కాలేజీ స్థాయి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో 75, ఎస్టీ రెసిడెన్షియల్స్లో 7, బీసీ గురుకులాల్లో 4 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు సీఎస్ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్స్ ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎస్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కాన్సెప్ట్ నోట్ను సిద్దం చేయాలన్నారు. ఈ నోట్ను తదుపరి సూచనల కోసం సీఎంకు అందజేయాల్సి ఉంటుందన్నారు.