హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సోమవారం బయలుదేరారు. మంగళవారం నుంచి ఈ నెల 13 వరకు సదస్సులు జరుగుతాయి. తొలిరోజు నర్సింహాచార్యులు, బుధ, గురువారాల సదస్సుకు గుత్తా, పోచారం హాజరుకానున్నారు. ముగింపు రోజు జైపూర్లో పర్యటించనున్నారు.