హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది 12 కోట్ల పనిదినాలు మంజూరు అయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. సచివాలయంలో ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్శాఖ పనితీరుపై అధికారులతో గురువారం మంత్రి సమీక్షించారు. ఈ పనిదినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపోనెంట్తో అవసరమైన చోట నూతన పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని అదేశించారు.
పీఅర్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్తగా 750 పోస్టులు మంజూరవుతాయని, త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపుపై ఏర్పాటుచేసిన కమిటీ నివేదికల ఆధారంగా విడతల వారీగా వారిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.