హైదరాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని ప్రతి దేశంలో ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఇది మన ఘనత. కానీ, దేశంలోని 73 శాతం మంది యువతకు ఈమెయిల్ అటాచ్మెంట్ పంపడం రాదు. ముక్కుసూటిగా చెప్పాలంటే.. కంప్యూటర్ పనితీరుకు సంబంధించిన ప్రాథమిక విషయాలు కూడా తెలియవు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది(15-29 ఏండ్ల వయస్కులు)తో 2020-21లో నిర్వహించిన సర్వేలో ఈ షాకింగ్ నిజాలు తెలిశాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) నైపుణ్యాల్లో ఉత్తరాది కంటే దక్షిణాది యువత మెరుగ్గా ఉన్నారు.
73 % ఈ-మెయిల్ అటాచ్మెంట్ పంపడం రాదు. కంప్యూటర్ ప్రాథమిక విషయాలు తెలియవు
10 % స్ప్రెడ్ షీట్లో ప్రాథమిక అంకగణిత సూత్రాలను ఉపయోగించగలిగే నైపుణ్యాలు తెలుసు
9 % ఏదైనా సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రజంటేషన్ రూపొందించడం తెలిసినవారు
20 % సాఫ్ట్వేర్ను కనుగొనడం, డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం తెలుసు
12 % ప్రింటర్, కెమెరా వంటి కొత్త పరికరాన్ని కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయగలరు.
97 % ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి కంప్యూటర్ ప్రోగ్రామ్ను ఎలా రాయాలో తెలియదు.
ఆధారం: నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నివేదిక