కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారని, వారికి తీవ్రంగా దెబ్బలు తగిలాయని చెప్పారు. మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.