నాంపల్లి కోర్టులు, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ సంఘం అందించే ఆరోగ్య బీమా కార్డుల కోసం సీఎం కేసీఆర్ రూ.7 కోట్లు మంజూరు చేసినట్టు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు గండ్ర మెహన్రావు తెలిపారు. నిరుడు ప్రభుత్వం రూ.6 కోట్లు ఇచ్చిందని, ఈసారి కూడా నిధులివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఈ సంవత్సరం ఆరోగ్య బీమా కార్డుల ప్రీమియం రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. నిరుడు న్యాయవాదుల సంఖ్య 22 వేలు ఉండగా, ఈ ఏడాది 40 వేలకుపైగా ఉండటంతో సీఏం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.