హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 36 కు లాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 67.30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూశాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ (గౌడ్) పేరును ‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్రస్ట్’గా మార్చింది.