తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections )కు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చితమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఫలితంగా సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేసరికి 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.