హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. రాష్ర్టంలో కరోనా నుంచి మరో 746 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 9,188 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది. గురువారం 1,11,947 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.