హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొర్రెల కాపరులకు రెండో విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు దాదాపు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్లో మంత్రి హరీశ్రావును జైపాల్యాదవ్ ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిధుల మంజూరు ద్వారా రాష్ట్రంలోని 3.60 లక్షల మంది గొర్రెల పెంపకందారులకి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.